గ్రీన్ ఇండియా ఛాలెంజ్‎ను స్వీకరించిన హీరో..!

by  |
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‎ను స్వీకరించిన హీరో..!
X

దిశ వెబ్‎డెస్క్: సినీ దర్శకుడు విజయ్ కుమార్ కొండ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‎ను సినీ హిరో రాజ్ తరుణ్ స్వీకరించారు. ఛాలెంజ్‎లో భాగంగా గచ్చిబౌలిలో హీరో రాజ్ తరుణ్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరిచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాను కూడా ఒకరిగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం రాజ్ తరుణ్ హీరోయిన్ హేమల్ ఏంగఏ, ఆర్టిస్ట్ మధునందన్‎లు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‎ను స్వీకరించి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరాడు.


Next Story

Most Viewed