డబ్బున్నవారే ఆమె టార్గెట్..!

by  |
డబ్బున్నవారే ఆమె టార్గెట్..!
X

దిశ, వెబ్‎డెస్క్:

అడ్డదారిలో డబ్బులు సంపాదించడం కోసం వలపు వలలు విసురుతోంది. ఆమెకు డబ్బున్నవారే టార్గెట్. వారితో పరిచయాలు పెంచకుని, వలపు వల విసరడం.. సన్నిహితంగా ఉన్న సమయంలో కెమెరాల్లో రికార్డు చేస్తోంది. అనంతరం ఫోటోలు, వీడియోలు అడ్డుపెట్టుకుని డబ్బులను డిమాండ్ చేస్తోంది. దీంతో కొందరు ఆమెకు సొమ్ములు సమర్పిస్తున్నారు. మరికొంతమంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని టీచర్స్ కాలనీకి చెందిన ఓ మహిళ.. పలువురు బడా వ్యాపాస్తులు, ఉద్యోగస్తులతో పరిచయం చేసుకుంటుంది. ఈ క్రమంలో పాల్వంచ శాస్త్రి రోడ్డులోని ఓ వ్యాపారస్తుడితో పరిచయం చేసుకుంది. అతనితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి రూ.10 లక్షలు డబ్బులు డిమాండ్ చేసింది కిలాడీ లేడి. అంత మొత్తంలో డబ్బులు ఇచ్చుకోలేని సదరు వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె వలలో కేటీపీఎస్‎లో పనిచేస్తున్న డివిజనర్ ఇంజనీర్ స్థాయి అధికారి ఒకరు, మరొక ఫోర్‎మెన్ కూడా చిక్కుకున్నట్లు తెలుస్తోంది.


Next Story