స్వీటీని వరించిన తాప్సీ ప్రాజెక్ట్

by  |
స్వీటీని వరించిన తాప్సీ ప్రాజెక్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్వీట్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన ‘నిశ్శబ్దం’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను థియేటర్‌లోనే రిలీజ్ చేయాలని ముందుగా భావించినా.. ఫైనల్‌గా ఓటీటీ రిలీజ్‌కే మొగ్గు చూపడంతో అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో రూపుదిద్దుకున్న చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమాలో స్వీటీ మూగ అమ్మాయిగా కనిపించనుంది. ఈ క్యారెక్టర్ ద్వారా తన కెరీర్‌లో మరో బెస్ట్ రోల్ అందుకున్న స్వీటీ.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు పెయింటింగ్, మూగ భాష కూడా నేర్చుకుంది. కాగా స్వీటీ అద్భుత నటనకు ఫిదా అయిన దర్శకుడు హేమంత్ మధుకర్.. తను డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అని ప్రశంసించాడు.

అయితే, స్వీటీకి ముందు ఈ పాత్రకు తాప్సీని ఎన్నుకున్నామని.. వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల తను ఈ సినిమా చేయలేకపోయిందని తెలిపాడు. నిర్మాతల్లో ఒకరైన కోనా వెంకట్ ఫ్లైట్‌లో కలిసినప్పుడు అనుష్కకు ఈ కథ వినిపించగా వెంటనే ఓకే చెప్పేసిందని తెలిపాడు. మాధవన్ కూడా స్టోరీ చెప్పగానే ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెప్పాడు హేమంత్. కాగా ఈ సినిమాలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.


Next Story

Most Viewed