మేళ్లచెర్వులో బారులు తీరిన మొక్కజొన్న లారీలు

by  |
మేళ్లచెర్వులో బారులు తీరిన మొక్కజొన్న లారీలు
X

దిశ, నల్లగొండ: కరోనా మహమ్మారి భయంతో లారీ డ్రైవర్లు, క్లీనర్లు వణికిపోతున్నారు. నిత్యం బిక్కుబిక్కుమంటూనే డ్యూటీలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నలను లారీల్లో మేళ్లచెర్వుకు తరలించారు. అయితే, మేడే కారణంగా హమాలీలు లేకపోవడంతో అన్‌లోడ్ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో మేళ్లచెర్వులో లారీలు బారులు తీరాయి. ఆహారం, తాగునీరు దొరక్క లారీ డ్రైవర్లు, క్లీనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా అన్‌లోడ్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

tag: lorries, sweet corn, unload, mellacheruvu, nalgonda, ts news


Next Story