హైదరాబాద్‌‌లో భారీ వర్షానికి వ్యక్తి గల్లంతు

by  |
హైదరాబాద్‌‌లో భారీ వర్షానికి వ్యక్తి గల్లంతు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో భారీ వర్షానికి మరో వ్యక్తి గల్లంతయ్యాడు. సరూర్‌నగర్ తపోవన్ కాలనీలో స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు. బాలాపూర్ ప్రాంతానికి చెందిన 35కాలనీలకు చెందిన నీరు మినీట్యాంక్‌బండ్‌‌కు వెళ్తున్న క్రమంలో తపోవన్‌కాలనీ వద్ద వరద భారీగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో అక్కడికి స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి కాసేపు ఆగి మళ్లీ వెళ్లే క్రమంలో వరదలో కొట్టుకుపోయాడు. పక్కనున్నవారు ఎంత ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. రెండ్రోజుల క్రితం నేరేడ్‌మెట్ నాలాలో పడి సుమేధ అనే బాలిక చనిపోయిన ఘటన మరువక ముందే భాగ్యనగరంలో మరో వ్యక్తి గల్లంతు కావడం ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది.



Next Story