రూ.3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

by  |
రూ.3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
X

దిశ, మునుగోడు: తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు పాతటైర్ల లోడ్‌తో వెళ్తున్న వాహనంలో గంజాయిని తరిలిస్తున్నారు. విషయం తెలుసుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) హైదరాబాద్ జోన్ అధికారులు పక్కా సమాచారంతో చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం లారీని పట్టుకొని గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

సుమారుగా రూ.3కోట్ల 56లక్షల విలువ చేసే 1427 కిలోల గంజాయిని తరలిస్తున్నట్టు అధికారులు నిర్దారించారు. గుట్టుచప్పుడు కాకుండా గూడ్స్ లారీలో ఒక ప్రత్యేక క్యాబిన్‌లో తీసుకెళ్తున్నట్టు అధికారుల తనిఖీలో బహిర్గతం అయ్యింది. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న యాజమాని, అందుకు సహకారించిన లారీ డైవర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


Next Story

Most Viewed