కరోనా భయంతో హర్ట్ఎటాక్..!

by  |
కరోనా భయంతో హర్ట్ఎటాక్..!
X

దిశ , నారాయణఖేడ్: ‎

కరోనా పాజిటివ్ రావడంతో గుండెపోటు వచ్చి మరణించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వెంకన్నపల్లి తండాకు చెందిన వేముల నాయక్‎కు కరోనా లక్షణాలు కనిపించడంతో బుధవారం నిజాంపేట్ పీహెచ్సీలో పరీక్షలు చేయించుకున్నాడు. ఈ క్రమంలో అతనికి పాజిటివ్‎గా నిర్ధారణ అవ్వడంతో వైద్యులు.. మందులు అందించి హోం ఐసోలేషన్‎లో ఉండాలని సూచించారు. అయితే కరోనా తన ప్రాణాల మీదకు వస్తుందేమోననే భయంతో.. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కోవిడ్ వ్యాధి వస్తే ఎవరూ భయాందోళనలకు గురి కావద్దని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్ సూచించారు.


Next Story

Most Viewed