రివాల్వర్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య…

by  |
రివాల్వర్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య…
X

ఓ హెడ్ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం…జైపూర్ లోని సామెద్ పోలీస్ స్టేషన్‌లో శ్రీ రాం అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కాగా సోమవారం విధులకు ఆయన హాజరు కాలేదు. దీంతో సహా ఉద్యోగి ఒకరు శ్రీరామ్ మొబైల్ నెంబర్‌కు పోన్ చేశారు. కానీ శ్రీరామ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి శ్రీరామ్ ఉంటున్న క్వార్టర్ కు ఆ ఉద్యోగి వెళ్లి చూశాడు. కాగా అక్కడ శ్రీరామ్ మరణించి ఉండటాన్ని ఉద్యోగి గమనించాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానసిక ఒత్తిడికి తట్టులేక ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed