- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం యోగి సంచలన నిర్ణయం..
by Anukaran |

X
దిశ, వెబ్డెస్క్ :
హాథ్రాస్ హత్యాచార ఘటనపై యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని సీఎం యోగి ఆదిత్యనాధ్ నిర్ణయించారు. అందుకు సంబంధించి శనివారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. దళిత యువతిపై గ్యాంగ్ రేప్తో పాటు అత్యంత పాశవికంగా హత్యచేసిన నలుగురు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లవెల్లుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే బాధితురాలి కుటుంబాన్ని యూపీ ఉన్నతాధికారులు కలిసి రిపోర్టు ఇచ్చిన అనంతరం సీఎం యోగి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇదివరకే ఈ కేసును దర్యాప్తు చేయడానికి సిట్ బృందాన్ని యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, రేపు సాయంత్రం 4గంటలకు నివేదిక ఇవ్వాలని వారికి ఆదేశాలు జారీ అయ్యాయి.
Next Story