హర్యానా అసెంబ్లీ స్పీకర్, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా

by  |
హర్యానా అసెంబ్లీ స్పీకర్, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
X

ఛండీగడ్: హర్యానా అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో స్పీకర్, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తాతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా తేలినట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. కానీ, ఇంతలోనే స్పీకర్‌కు పాజిటివ్ తేలడంతో డిప్యూటీ స్పీకర్ రణబీర్ గాంగ్వా సమావేశాలను నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరువుతున్న ఎమ్మెల్యేలందరికీ, సీఎం, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రులకు కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. ఇందులో నెగెటివ్ వచ్చినవారే సమావేశంలో పాల్గొనాలని ప్రభుత్వం స్పష్టంచేసింది.


Next Story