నంది ఎల్లయ్య మృతి పట్ల హరీశ్‌రావు దిగ్భ్రాంతి

by  |
నంది ఎల్లయ్య మృతి పట్ల హరీశ్‌రావు దిగ్భ్రాంతి
X

దిశ, సిద్ధిపేట: మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సిద్ధిపేట పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా తనతో కలిసి పని చేసిన అనుబంధాన్ని గుర్తు చేస్కున్నారు. నంది ఎల్లయ్య సీనియర్ రాజకీయ నాయకునిగా రాజకీయాల్లో తన నిరాడంబరాన్ని చాటుకున్నారని, మంచి మనసున్న వ్యక్తిత్వం అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


Next Story

Most Viewed