- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ మంగళవారం తన నివాసంలో హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజకు ఒక రోజు ముందే ఆయన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కొవిడ్ 19 ప్రొటోకాల్స్లన్నీ అమలవుతాయని కాంగ్రెస్ ప్రతినిధి భూపేంద్రగుప్తా తెలిపారు.
కమల్నాథ్ హనుమంతుడి భక్తుడని, మంగళవారం రోజున కాంగ్రెస్ నాయకులు తమ నివాసాల్లో హనుమాన్ చాలీసాను పఠించాలని కోరినట్టు గుప్తా వివరించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు కారణమడగ్గా, మంగళవారం మంగళకరమైన రోజు కాబట్టే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం అందరి ఆమోదంతో నిర్మితమవుతోందని కమల్నాథ్ శనివారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Next Story