ఆ బిల్లులు గొడ్డలి పెట్టులాంటివి

by  |
ఆ బిల్లులు గొడ్డలి పెట్టులాంటివి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు గొడ్డలి పెట్టులాంటివని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ… కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే కేంద్రం ఈ బిల్లులు తీసుకువచ్చిందన్నారు. నూతన విద్యుత్, వ్యవసాయ బిల్లులను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. దశల వారీగా మార్కెట్, ఎఫ్‌సీఐ, ఎంఎస్పీ నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రయత్నాలు చేస్తోందని, ఫెడరల్ విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపారు.



Next Story

Most Viewed