గల్ఫ్‌లో నిజామాబాద్ వాసి మృతి

by  |
గల్ఫ్‌లో నిజామాబాద్ వాసి మృతి
X

దిశ, బాల్కొండ: పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లిన, కార్మికులు ఇటీవల అనేక మంది మృతిచెందుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బండారి గంగారం(63) మంగళవారం సౌదీలోని జుబ్బాలో గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగుజూసింది.

వివరాళ్లోకి వెళితే… విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య జయసుధ, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురు పెళ్లికి అప్పు చేయడంతో, తీర్చడం కోసం వలస వెళ్లినట్టు సమాచారం. ప్రభుత్వం చొరవ తీసుకుని, మృతదేహని స్వస్థలానికి రప్పించి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.



Next Story

Most Viewed