గ్రానైట్ లారీ ఢీకొని యువకుడు మృతి

by  |
గ్రానైట్ లారీ ఢీకొని యువకుడు మృతి
X

దిశ, డోర్నకల్: గ్రానైట్ లారీ ఢీ కొని యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రం శివారు ఎస్సారెస్పీ కెనాల్ చారితండా సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… మాటేడు గ్రామానికి చెందిన ప్రభాకర్(27) విద్యుత్ శాఖలో ప్రైవేటు హెల్పర్‌గా పనిచేస్తున్నాడు.

రోజులాగే మాదిరిగానే విధులు ముగించుకుని పడమటిగూడెంలోని తన అత్త గారిట ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో ఖమ్మం వరంగల్ హైవేపై ఆగి ఉన్న గ్రానెట్ లారీని ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Next Story