మానేరు వాగులో తాత, మనవడు గల్లంతు

by  |
మానేరు వాగులో తాత, మనవడు గల్లంతు
X

దిశ, సిరిసిల్ల: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మానేరు వాగులో తాత మనవడు పడి గల్లంతయ్యారు. గంభీరావుపేట మండలం కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒగ్గు మల్లయ్య(65) తన మనవడు అఖిరేష్ నందన్(9)తో కలిసి మోటర్ వద్ద నాచు తీస్తుండగా ప్రమాదవశాత్తు మానేరు వాగులో పడి గల్లంతయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.



Next Story

Most Viewed