టెంపుల్ సిటీ సందర్శించిన ప్రభుత్వ విప్

by  |
టెంపుల్ సిటీ సందర్శించిన ప్రభుత్వ విప్
X

దిశ ,ఆలేరు: తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి అభివృద్ధిలో భాగంగా 250ఎకరాల్లో నిర్మాణం చేపట్టిన టెంపుల్ సిటీని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి శనివారం సందర్శించారు. ఆమె వెంట వైటీడీఎ వైస్ చైర్మన్ కిషన్ రావుతో పాటు శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయ ఈఓ గీతా‌రెడ్డి కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా అభివృద్ధి పనులు ఎంతవరకూ వచ్చాయి.. టెంపుల్ సిటీలో కొత్తగా నిర్మాణం చేయనున్న కాటేజీలు, అతిధి గృహాలు పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు వంటి పనుల గురించి వైటీడీఎ వైస్ చైర్మన్, ఈఓ గీతా‌రెడ్డిని ఆమె అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కొలనుపాకలోని సోమేశ్వర ఆలయం, కోటి లింగాల గుడి పురాతన చరిత్ర కలిగిన దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని గొంగిడి సునీత ఆలేరు ఎమ్మెల్యే కిషన్ రావును కోరారు.


Next Story

Most Viewed