’వారి కృషితోనే కరోనాపై విజయం సాధించాం’

by  |
’వారి కృషితోనే కరోనాపై విజయం సాధించాం’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంపై గవర్నర్ తమిళిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ స్పెషాలిటీస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడుతూ… డాక్టర్ల సహాయంతో రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాల్చకుండా విజయం సాధించామని తెలిపారు. 15 మంది డాక్టర్లు, వైద్యసిబ్బంది కొవిడ్‌కు బలి కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా 75 వైద్య కళాశాలలు నెలకొల్పాలన్న కేంద్రం నిర్ణయంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed