స్వీయ నిర్బంధంలోకి గవర్నర్..!

by  |
స్వీయ నిర్బంధంలోకి గవర్నర్..!
X

దిశ, వెబ్‎డెస్క్ : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. రాజ్‌భ‌వ‌న్‌లో ఏడీసీ అధికారికి క‌రోనా పాజిటివ్ రావడంతో ద‌త్తాత్రేయ ఐసోలేషన్ లోకి వెళ్లారు. దీంతో ఆయన అన్ని అపాయింట్‌మెంట్ల‌ను ర‌ద్దు చేసుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శి రాకేశ్ క‌న్వ‌ర్‌తో పాటు ఏడీసీ సిబ్బంది మొత్తాన్ని క్వారెంటైన్ కు తరలించారు. మరోవైపు ఆరోగ్య‌శాఖ సిబ్బంది వారంద‌రికీ కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నుంది.

ఇటీవ‌ల ఆ రాష్ట్రానికి చెందిన మంత్రులు సుక్రామ్ చౌద‌రీ, మ‌హేంద‌ర్ సింగ్ థాకూర్‌లకు పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా, ప్ర‌స్తుతం వారిద్దరూ కోలుకున్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 12,899 ఉంది.


Next Story