దమ్మలపాటి కేసుపై సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం

by  |
దమ్మలపాటి కేసుపై సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ కేసులో ఏసీబీ దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్‌ సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు మామ, బావమరిది ద్వారా కృష్ణా జిల్లాలో ఆస్తులు కొనుగోలు చేశారంటూ ఏసీబీ అభియోగాలు నమోదు చేసింది. 2015-16లో భార్య పేరిట దమ్మాలపాటి శ్రీనివాస్ ఆస్తులు కొనుగోలు చేశారని ఏసీబీ తెలిపింది. అమరావతి భూములపై హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్‌ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా స్టే వచ్చింది. తదుపరి చర్యలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్‌లోని సమాచారాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదని హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది.



Next Story