- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు కెనాల్ కు గండిపడింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి, పెద్దతండ గ్రామ సమీపంలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు కెనాల్ లోకి అత్యధికంగా నీరు చేరుకోవడం ద్వారా పంజగుట్ట తండా సమీపంలో నీరు ముందుకు వెళ్లకవడంతో స్టోరేజీ పెరిగి కెనాల్ తెగినట్లు స్థానిక రైతులు చెప్పుతున్నారు.
చిన్నపాటి వర్షాలకే కెనాల్ తెగితే ప్రాజెక్టు పూర్తైన తర్వాత ఇతర ప్రాంతాలకు నీరు తరలించేటప్పుడు ఇంకెన్నిసార్లు కాలువ తెగుతుందోనని రైతులు, గ్రామస్తులు కాంట్రాక్టర్లు, అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రాజెక్టు కెనాల్ తెగిపొవడంతో మోత్కులపల్లి, కట్కూరు, పెద్దతండ ప్రాంతాల్లోని వరి,పత్తి, కంది పంటలు పూర్తిగా నీట మునిగాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటనష్ట పరిహారం అందించాలనని కోరుతున్నారు.