గిరిజన విద్యార్థులకు గుడ్ న్యూస్

by  |
గిరిజన విద్యార్థులకు గుడ్ న్యూస్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న గిరిజన విద్యార్థుల స్కాలర్ షిప్‌ల విడుదలకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు 2014-15 నుంచి 2019-20 వరకూ పెండింగ్‌లో ఉన్న గిరిజన విద్యార్థుల స్కాలర్ షిప్‌ల హార్డ్ కాపీలను విద్యార్థుల వేలి ముద్రలు వేయించి, దరఖాస్తులను జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు. విద్యార్థులు కూడా తమ సమీప మీసేవా కేంద్రంలో వేలి ముద్రలు వేయడం ద్వారా వెంటనే స్కాలర్ షిప్‌లు మంజూరు చేయడం జరుగుతోందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి తెలిపారు.


Next Story