జియో వినియోగదారులకు శుభవార్త..!

by  |
జియో వినియోగదారులకు శుభవార్త..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్ర‌ముఖ దిగ్గ‌జ నెట్ వ‌ర్క్ కంపెనీ‌ జియో వినియోగ‌దారుల‌ను శుభవార్త తెలిపింది. తాజాగా క‌స్ట‌మ‌ర్స్‌కు ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది. జియో తన ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా వరుసగా నాలుగు రోజుల పాటు ఈ డేటా అందుబాటులో ఉంచ‌నుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కూడా కొంతమంది క‌స్ట‌మ‌ర్స్‌కు ఈ ఆఫర్‌ను కంపెనీ అందించింది. ఇప్పుడు కూడా అంద‌రికీ కాకుండా సెల‌క్టెడ్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మీరు 1.5 జీబీ డేటా ప్లాన్‌ను వినియోగిస్తుంటే.. ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటే మ‌రో 2 జీబీతో కలిపి మొత్తంగా 3.5 జీబీ డేటా వ‌స్తుంది. గతంలో ఈ ఆఫర్‌ను ఐదు రోజుల అందించిన జియో.. ఇప్పుడు నాలుగు రోజుల‌కు త‌గ్గించింది.

ఈ ప్లాన్ మీ నెంబ‌రుకు అందుబాటులో ఉందో లేదో.. మై జియో యాప్ లేదా జియో వెబ్ సైట్లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. అందులో మై ప్లాన్స్‌ను చెక్ చేసుకుంటే.. అక్కడ జియో డేటా ప్యాక్ అనే ఆప్షన్ కింద మీకు ఈ అదనపు డేటా లభిస్తుంది. జియో సంస్థ‌ ఈ ఆఫర్‌ను ఎప్పటి నుంచో తన క‌స్ట‌మ‌ర్స్‌కు అందిస్తోంది. 2018 జులై నుంచి స్టార్ట్ చేశారు. అయితే క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో మార్చి నుంచి ప్రతి నెలా చివర్లో ఈ ఆఫర్‌ను జియో కొంతమంది క‌స్ట‌మ‌ర్స్‌కు మాత్ర‌మే అందిస్తోంది.


Next Story