ఈ శుభవార్త మీ కోసమే

by  |
ఈ శుభవార్త మీ కోసమే
X

దిశ, వెబ్ డెస్క్: గిరిజన యువతకు ఓ శుభవార్త. తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఓ ప్రకటన చేశారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాల కోసం ‘గోల్’ కార్యక్రమంలో పాల్గొనాలని, అందుకోసం రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5 వేల మంది యువతకు డిజిటల్ లో శిక్షణా ఇచ్చేందుకు కేంద్ర గిరిజన శాఖ ‘గోల్’ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిజినెస్, ఆరోగ్యం, రాజకీయం, ఔత్సాహికం, అధ్యయనం, లైఫ్ స్కిల్స్, కళలు వంటి వాటిల్లో ఆసక్తి ఉన్నవారు వెబ్ సైట్ ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.


Next Story