పెళ్లి తంతు.. యువతి సూసైడ్..!

by  |
పెళ్లి తంతు.. యువతి సూసైడ్..!
X

దిశ, నారాయణఖేడ్ :

కూతురుకి పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకోవాలని తల్లిదండ్రులు ఎన్నో కలలుగన్నారు. తీరా ఆ సమయం రానే వచ్చింది. అంతా ఒకే అనుకుని, కట్నం గురించి మాట్లాడుకుంటున్న విషయాలు ఆ యువతి చెవిన పడ్డాయి. దీంతో తాను ఎవరికీ ఇబ్బంది కాకూడదని భావించిన ఆమె ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని సంజీవన్ రావ్‌పేట్‌లో ఆదివారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బోడి మల్లయ్య, సుశీల దంపతుల కూతురు రూప(19) ఇంటర్ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే యువతి తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ఓ సంబంధం గురించి మాట్లాడుతున్న క్రమంలో కట్నం విషయంలో ఇంకా సర్దుబాటు కాలేదని తెలిసింది. దీంతో తన వివాహం కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని భావించిన రూప మనస్తాపానికి గురైంది. సరిగ్గా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎంతో భవిష్యత్ ఉన్న రూప ఇలా చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్తులను కలచివేసింది. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Next Story