ఓటీఎస్​పై విస్తృత ప్రచారం

by  |
ఓటీఎస్​పై విస్తృత ప్రచారం
X

దిశ, న్యూస్​బ్యూరో: ఆస్తిపన్ను చెల్లింపుదారుకులకు వడ్డీ రాయితీ కల్పించే వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీంపై జీహెచ్‌ఎంసి విస్తృతస్థాయిలో ప్రచారం కల్పిస్తోంది. అందుబాటులో ఉన్న బకాయిదారుల మొబైల్‌ నెంబర్లకు మెసేజ్​లు పంపిస్తోంది. వడ్డీరాయితీ ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ఎఫ్‌ఎం రేడియో జింగిల్స్‌, టెలివిజన్‌ ఛానల్స్‌లో స్ర్కోలింగ్స్‌తో పాటు 150 బస్‌షెల్టర్లపై తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ భాషలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయిస్తోంది. మై జీహెచ్‌ఎంసీ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా ఇంటి నుంచే ప్రాపర్టీ టాక్స్‌ బకాయిలు చెల్లింపులు జరిపేందుకు 90శాతం వడ్డీమాఫీ ప్రయోజనాలు పొందేందుకు ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ ప్రక్రియను అప్‌ గ్రేడ్‌ చేసినట్టు జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్‌కుమార్​ తెలిపారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీంతో నగర పరిధిలో 5.41 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలగనుంది.


Next Story

Most Viewed