గాంధీ ఉత్సవాల చైర్మన్‌గా ప్రతాప్ రెడ్డి….

by  |
గాంధీ ఉత్సవాల చైర్మన్‌గా ప్రతాప్ రెడ్డి….
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జీకాట్ ) ఆధ్వర్యంలో నిర్వహించే మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాలకు చైర్మన్ గా డాక్టర్ ప్రతాప్ రెడ్డి ఎన్నికయ్యారు. జీకాట్ ను ఉస్మానియా పూర్వ విద్యార్థులు స్థాపించారు. కాగా పూర్వవిద్యార్థుల నిర్ణాయక సమావేశంలో ఆయనను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పీపుల్స్ హాస్పిటల్ అధినేతగా, గాంధీ మెడికల్ అలుమ్ని బాధ్యుడిగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడిగా డాక్టర్ ప్రతాప్ రెడ్డి చేస్తున్న సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కాగా తనపై నమ్మకం ఉంచి తనను చైర్మన్ గా ఎన్నుకున్నందుకు జీ కాట్ సంస్థ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Read Also…

కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే మద్దతుపై ఆలోచిస్తాం !


Next Story

Most Viewed