గణేష్ ఉత్సవాలకు షరతులు

by  |
గణేష్ ఉత్సవాలకు షరతులు
X

ముంబయి: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈసారి గణేశ్ నవరాత్రి ఉత్సవాలపైనే కాదు, విగ్రహాల ఎత్తుపైనా మహారాష్ట్ర సర్కారు ఆంక్షలు విధించింది. మండపాల్లో ఏర్పాటు చేసే వినాయకుడి విగ్రహాల ఎత్తు నాలుగు అడుగులను మించొద్దని ఆదేశించింది. వినాయక చవితి సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర హోం శాఖ గైడ్‌లైన్స్ జారీ చేసింది. వీటి ప్రకారం, గణపయ్య మండపాల నిర్వాహకులు విధిగా స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలని, నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించింది. మహారాష్ట్రలో గణేషుడి నవరాత్రి ఉత్సవాలు ఆడంబరంగా జరుగుతాయి. కానీ, కరోనా కారణంగా ఈ సారి ఉత్సవాలు నిరాడంబరంగా జరగనున్నాయి. రాష్ట్రంలో ఫేమస్ అయిన లాల్‌బాగ్‌లోని వినాయక విగ్రహమూ ఈ సారి కొలువుదీరడం లేదు. పూజల కోసం చిన్న ప్రతిమను ఉంచనున్నారు.


Next Story

Most Viewed