50వేల మట్టి గణపతుల పంపిణీ

by  |
50వేల మట్టి గణపతుల పంపిణీ
X

దిశ, వెబ్ డెస్క్ : గణేశ్ నవరాత్రులు సమీపిస్తుండటంతో జీహెచ్ఎంసీ( GHMC) కీలక నిర్ణయం తీసుకున్నది. ఈనెల 22న వినాయక చవితి సందర్భంగా 50వేల మట్టి గణపతుల ప్రతిమలను పంపిణీ చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథార్టీ అధికారులు ప్రకటించారు.

హైదరాబాద్ లోని కొన్నిప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఉచితంగా గణేశ్ విగ్రహాలను అందించనున్నట్లు తెలిపారు. నగరంలో ప్రతిసారీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (pop) వాడకాన్ని తగ్గించేందుకు Hmda అధికారులు ఇలా ఫ్రీగా మట్టి గణపతులను పంపిణీ చేస్తారు.

పర్యాణవరణ హితం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తల మధ్య ఈసారి నవరాత్రులు జరపాలని ముందుగా ఆర్డర్లు పాస్ చేయనున్నట్లు తెలుస్తోంది.


Next Story