ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఫ్రీ ట్రీట్ మెంట్.. తెలంగాణ సర్కార్ నిర్ణయం

by  |
ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఫ్రీ ట్రీట్ మెంట్.. తెలంగాణ సర్కార్ నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఆసుపత్రలతోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా వ్యాధి సోకిన రోగులకు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మొదటగా 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. అందులో కామినేని, మమత, మల్లారెడ్డి కాలేజీలు ఉన్నట్లు తెలిసింది. ఇందులో కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధివాధానాలు ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


Next Story

Most Viewed