- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశప్రతినిధి, ఆదిలాబాద్:
మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ RK-5 బి గనిలో బొగ్గు బ్లాస్టింగ్ కోసం హోల్స్ వేసే క్రమంలో మిస్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో కోల్ కట్టర్ రత్నం లింగయ్య అనే కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆయన్ను హైదరాబాద్కు తరలించారు.
ఈ ప్రమాదంలో కార్మికులు గాది శివయ్య, పల్లె రాజయ్య, చిలుక సుమన్ సైతం గాయపడ్డారు. వీరికి చికిత్స అందించేందుకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై మాజీ ఎంపీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘గాయపడిన కార్మికులు వెంటనే కోలుకోవాలని.. వారికి సింగరేణి సంస్థ నాణ్యమైన వైద్యం అందించాలని’ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా కోరారు.