తల్లి, భార్యను కత్తితో గొంతు కోసి.. పోలీసులకు ఫొన్

by  |
తల్లి, భార్యను కత్తితో గొంతు కోసి.. పోలీసులకు ఫొన్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నతల్లిని, కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఆపై తనుకు తానుగా పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియా న్యూటౌన్ స్క్వేర్‌లో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ నిందితుడిని భారత మాజీ అథ్లెట్ ఇక్బాల్‌ సింగ్‌ బోపరాయ్‌గా గుర్తించారు.

వివరాల్లోకివెళితే.. పంజాబ్‌లోని హోషియాపూర్‌ జిల్లా ఉర్మార్‌ తండాకు చెందిన 63 ఏండ్ల ఇక్బాల్‌సింగ్‌ బోపరాయ్‌ 80వ దశకంలో ఇండియా టాప్ షాట్‌పుట్‌ ఆటగాళ్లలో ఒకరు. 1983 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అతను కాంస్య పతకాన్ని సాధించాడు. అనంతరం అమెరికాలో స్థిరపడ్డాడు.

ఇదిలాఉండగా, వ్యక్తిగత కారణాల వలన ఆదివారం తన భార్య, తల్లిని కత్తితో గొంతు కోసి హతమార్చాడు. ఆ తర్వాత పోలీసులకు ఫొన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలాని చేరుకున్న పోలీసులు మూడో అంతస్తులో తల్లి, రెండో అంతస్తులో భార్య మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రక్తం అంటుకుని ఉన్న కత్తిని కిచెన్‌లో స్వాధీనం చేసుకుకొని.. నిందితుడు ఇక్బాల్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్‌ పోలీసులు వెల్లడించారు.


Next Story

Most Viewed