నిండు కుండలా కోయిల్‎సాగర్..!

by  |
నిండు కుండలా కోయిల్‎సాగర్..!
X

దిశ, దేవరకద్ర: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. దేవరకద్ర మండలంలోని కోయిల్‎సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

కోయిల్‎సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో బండర్‎పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు దగ్గరికి మత్స్యకారులు, స్థానికులు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. మరోవైపు సరళసాగర్ ప్రాజెక్టు నిండడంతో ఆటోమెటిక్ సైఫాన్‎లు ఓపెన్ అవ్వడంతో.. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు.


Next Story