కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో..

by  |
కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో..
X

దిశ, వెబ్‌డెస్క్ :

భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్65 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో వరద ఉధృతి పెరిగింది.

ప్రస్తుతం మేడిగడ్డకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.39లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ బ్యారేజి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 16.17టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 8.06 టీఎంసీలుగా ఉందని అధికారులు వెల్లడించారు. అయితే, బ్యారేజికి వరద నీరు పెరుగుతుండటంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.



Next Story