సింగరేణి గనిలో ప్రమాదం

by  |
సింగరేణి గనిలో ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లాలో ప్రమాదం జరిగింది. శ్రీరాంపూర్‌ ఏరియాలోని సింగరేణి ఆర్కే బి గనిలో బుధవారం సాయంత్రం గనిలో బొగ్గును వెలికి తీసేందుకు పేలుడు పదార్థాలు ఏర్పాటు చేయగా… కేబుల్ వైర్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో బ్లాస్టింగ్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో అక్కడ పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు లింగయ్య, రత్నం, రాజం, సుమన్, శ్రీకాంత్‌ గాయపడగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.


Next Story

Most Viewed