సముద్రంలో మత్స్యకారులు గల్లంతు

by  |
సముద్రంలో మత్స్యకారులు గల్లంతు
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలోని సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతయ్యారు. మూడు రోజులకు క్రితం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలోని క్రీస్తునగరానికి చెందిన 12 మంది మత్స్యకారులు మూడు బోట్లలో చేపల వేటకు వెళ్లారు. గురువారం తిరుగు ప్రయాణంలో భైరవపాలెం సమీపంలో బోటుతో సహా నలుగురు జాలర్లు గల్లంతయ్యారు. వారితోపాటు వేటకు వెళ్లిన మరో 8 మంది రెండు బోట్లతో సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు తమ వారి కోసం మత్స్యకారుల కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.


Next Story

Most Viewed