కరోనా టైం: తెలంగాణలో ఈ-సెట్ పరీక్ష స్టార్ట్

by  |
కరోనా టైం: తెలంగాణలో ఈ-సెట్ పరీక్ష స్టార్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో పరీక్షల సందడి మొదలైంది. కరోనా కాలంలో నిర్వహిస్తున్న తొలిపరీక్ష ప్రారంభమైంది. రెండు విడతలుగా ఈసెట్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. 56 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్ష రాసేందుకు 38 వేల 26 మంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి పరీక్షా కేంద్రాలకు రావాలని, శానిటైజర్లు వాడాలని అధికారులు సూచిస్తున్నారు.


Next Story

Most Viewed