ఆర్కెస్ట్రాలో వివాదం..తండ్రీకొడుకుపై కాల్పులు

by  |
ఆర్కెస్ట్రాలో వివాదం..తండ్రీకొడుకుపై కాల్పులు
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్‌‌లో తండ్రీకొడుకుపై కాల్పులు కలకలం సృష్టిస్తోంది. సమస్తిపూర్ జిల్లా మహిసరి గ్రామంలో ఈఘటన చోటుచేసుకుంది. గ్రామంలో గురువారం సాయంత్రం ఆర్కెస్ట్రా నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకు వీరేంద్ర పాశ్వాన్, రూపేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా వివాదం చెలరేగింది. ఇంతలో దుండగులు అక్కడి చేరుకుని తండ్రీకొడుకులపై కాల్పులు జరిపారు. తండ్రి వీరేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా, రూపేశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం రూపేశ్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Next Story