క్రూడాయిల్‌తో వస్తున్న నౌకలో మంటలు

by  |
క్రూడాయిల్‌తో వస్తున్న నౌకలో మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక తీరానికి తూర్పున 37నాటికన్ మైళ్ల దూరంలో ‘ఎంటీ న్యూ డైమండ్‌ నౌక’లో మంటలు చెలరేగాయి. కువైట్ నుంచి పారదీప్‌‌నకు 2లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్‌తో వస్తుండటగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే శ్రీలంక నావికాదళం భారత కోస్టుగార్డు సాయాన్ని కోరగా సహాయక చర్యలకు ఐసీజీ నౌకలు, విమానాలను మోహరించారు. ఐసీజీ నౌకలు, శౌర్య, సారంగ్, సముద్ర పహేదార్, డోర్నియర్ విమానాలను ఇందుకు వినియోగిస్తున్నట్లు ట్విట్టర్‌లో అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 23న కువైట్‌ నుంచి క్రూడాయిల్‌తో బయల్దేరిన నౌక ఈనెల 5భారత్‌లోని పారాదీప్‌ దీవులకు చేరుకోవల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.



Next Story