పెల్లెట్ ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం

by  |
పెల్లెట్ ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం
X

దిశ, పటాన్‌చెరు:

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని పిల్లెట్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో కార్మికుడు ఆచూకీ కోసం సిబ్బంది గాలిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Next Story