పాల్వంచ అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు

by  |
పాల్వంచ అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిజర్వ్ అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య బుధవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసరపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇదేక్రమంలో పోలీసులపై కాల్పులు జరిపిన మావోయిస్టులు.. తప్పించుకున్నారు. దీంతో పోలీసులు అటవీప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. కాల్పులు చోటు చేసుకున్న ప్రాంతంలో తుపాకీ, కిట్ బ్యాగులు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.


Next Story

Most Viewed