ఆమె ప్రేమ, 18లక్షలు, 8 మందిపై కేసు 

by  |
ఆమె ప్రేమ, 18లక్షలు, 8 మందిపై కేసు 
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం, ఎం.సున్నాపల్లికి చెందిన ఓ యువతి తనకు న్యాయం చేయాలని పెద్దలను ఆశ్రయిస్తే… ఆమెను మోసం చేసి డబ్బు నొక్కేశారు. ఇదేంటని అడిగితే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.

నౌపడ ఎస్ఎ మహమ్మద్ యాసిన్ తెలిపిన వివరాలు మేరకు… సున్నాపల్లికి చెందిన కొమర రమ్య అదే గ్రామానికి చెందిన యువకుడితో తనకు ఉన్న ప్రేమ విషయంలో న్యాయం చేయాలని పెద్దలను ఆశ్రయించింది. ఊరి పెద్దలు, యువకుడిని రమ్యకి రూ .18 లక్షలు ఇవ్వాలని నగదు పరిష్కారం చూపారు.

దీనిలో రూ. 8 లక్షలు మాత్రమే ఇచ్చి రూ.10 లక్షలు వారు తీసుకున్నారు. మిగతా సొమ్మును అడిగితే ఆమెను లైంగికంగా వేధించారు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో గ్రామానికి చెందిన ఆరుగురు పెద్ద మనుషులు, మరో ఇద్దరు బయట వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also..

కూతురు లవ్ మ్యారేజ్.. తండ్రి సూసైడ్ !


Next Story