- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు

X
దిశ, వెబ్డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు, మాస్కు పెట్టుకోని వారికి రూ.2వేల జరిమానా విధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో వివిధ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలన్న ప్రతిపక్షాల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
Next Story