- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వృద్ధుడు వసంతరావు మిస్సింగ్ కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు. విజయవాడ కోవిడ్ ఆసుపత్రి మార్చురీలో వృద్ధుడు వసంతరావు మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. గత నెల మే 24న వృద్ధుడు ఆస్పత్రిలో మృతి చెందాడు. అనంతరం సిబ్బంది మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే వృద్ధుడి ఆచూకీ కోసం బంధువులు కోరినా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దాదాపు 10 రోజుల నుంచి వసంతరావు ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నా ఎటువంటి సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఆసుపత్రి సీసీ కెమెరాల ద్వారా పోలీసులు వృద్ధుడి ఆచూకీ కనుగొన్నారు. మార్చురీలో ఉన్న వసంతరావు మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అందజేశారు.
Next Story