అదనపు కట్నం కోసం మహిళకు చిత్ర హింసలు

by  |
అదనపు కట్నం కోసం మహిళకు చిత్ర హింసలు
X

దిశ, క్రైమ్‌బ్యూరో: అదనపు కట్నం తీసుకురావాలని చిత్రహింసలు పెడుతున్న భర్తపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నల్లకుంటకు చెందిన శ్వేత సుహాసిణికి ఏపీలోని తెనాలికి చెందిన కుమార చంద్రశేఖర్‌తో 2007, ఫిబ్రవరిలో వివాహం జరిగింది. ఆ సమయంలో వధువు తల్లిదండ్రులు వరకట్నంగా రూ.25లక్షలు, 50తులాల బంగారంతో పాటు రూ.20లక్షలు ఖర్చు పెట్టి వైభవంగా పెళ్లి చేశారు. కొద్దిరోజుల పాటు భార్యతో సఖ్యతగానే ఉన్న చంద్రశేఖర్ తర్వాత అదనపు వరకట్నం తేవాలని వేధించసాగాడు. ఈ క్రమంలోనే ఉద్యోగం చేస్తున్న భార్య నుంచి సైతం 9 ఏళ్లపాటు జీతం మొత్తం తీసుకున్నాడు. అయినా సంతృప్తి చెందని చంద్రశేఖర్ ఎక్కువ కట్నం కోసం ప్రతిరోజు మహిళను కొట్టేవాడు. ఈ క్రమంలోనే భార్యను గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టాడు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన మహిళ హైదరాబాద్‌‌కు వచ్చి సోదరుడితో కలసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు ఈ ఫిర్యాదును సీసీఎస్ మహిళా స్టేషన్‌కు బదిలీ చేయగా…. చంద్రశేఖర్‌పై గృహ హింస, వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేశారు. శ్వేత సుహాసిణి, చంద్రశేఖర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Next Story

Most Viewed