దారుణం.. కొడుకును చంపిన తండ్రి

by  |
దారుణం.. కొడుకును చంపిన తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్: సమాజంలో ఎదుగుతున్న కొద్ది ఒదిగి ఉండాలి.. అంతేస్థాయిలో తెలియని అంశాలను నేర్చుకోవాలి.. ఇతరులకు ఆదర్శంగా ఉండాలి అనేది నానుడి. కానీ, ప్రస్తుతం కొందరు వ్యక్తుల్లో మానవత్వం క్షీణిస్తోంది. వాళ్లు క్షణికావేశంతో దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ప్రేమానురాగాలు వారికి ఏ మాత్రం గుర్తుకురావట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది. దారుణంగా వ్యక్తి తన కన్నకొడుకునే చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని తెనాలి పాండురంగపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. సీతాపతి అనే వ్యక్తి తన కొడుకును కత్తితో పొడిచి చంపేసినట్లు తెలిసింది. తన కొడుకు మద్యం తాగి వేధిస్తున్నాడని అతడిని చంపేసినట్లు తెలిసింది. అయితే, విషయమేదైనా తాగి వేధిస్తున్నాడని చంపేయడం సరికాదని, అలాంటి వారిని క్రమక్రమంగా ఇతర మార్గాల్లో వారిచేత తాగుడు మాన్పించి పూర్తిగా వారు మారేలా చేయాలని పలువులు అంటున్నారు.


Next Story

Most Viewed