ఎవరికీ చెప్పుకోలేని ఓ కూతురి ఆవేదన.. చివరకు!

by  |
ఎవరికీ చెప్పుకోలేని ఓ కూతురి ఆవేదన.. చివరకు!
X

దిశ, వెబ్ డెస్క్ :
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్న కూతురుపై కన్నేశాడు. కామంతో కళ్లు మూసుకుపోవడంతో వరసలు కూడా చూడకుండా బాలిక పై కామవాంఛ తీర్చుకున్నాడు. మదర్సాలో చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పుతున్న 50ఏళ్ల తండ్రి.. పదహారేళ్ల కూతురుపై ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ చివరకు గర్బవతిని చేశాడు. తండ్రే మృగంలా మారి బాలిక జీవితాన్ని నాశనం చేయగా.. మరో ఆరుగురు కూడా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన కేరళలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. కేరళ రాష్టం కాసరగోడ్ జిల్లా ఓ మదర్సాలో టీచర్‌గా పని చేస్తున్న వ్యక్తి, కన్న కూతురుపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో బాలిక మూడు నెలల గర్భం దాల్చింది. వెంటనే నిందితుడు అబార్షన్ చేయించాడు. తండ్రికి తోడు గ్రామానికి చెందిన మరో ఆరుగురు యువకులు బాలికను లైంగికంగా వేధించారు. ఇదంతా గమనించిన బాలిక బంధువు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

సమాచారం అందుకున్న నీలేశ్వర్ పోలీసులు మదర్సాలో టీచర్స్‌గా పనిచేస్తున్న బాలిక తండ్రిని, లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరుగురి యువకులను అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలో కూడా పలువురు అబ్బాయిల పై అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. విచారణలో తేలింది. ఈ మేరకు వారందరిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ ముగ్గురు నిందితుల్ని రియాస్, ఇజాజ్, మహ్మద్ అలీగా గుర్తించారు. కాగా, బాలికపై జరుగుతున్న అకృత్యాలు తల్లికి తెలుసా.? లేదా..? ఎందుకు మౌనంగా ఉందన్న విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.


Next Story

Most Viewed