తండ్రీకూతురి ఉసురు తీసిన అప్పులు

by  |
తండ్రీకూతురి ఉసురు తీసిన అప్పులు
X

దిశ, కామారెడ్డి: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులతో తండ్రీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలనీ సమీపంలోని గోసంగి బజారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది.

కూలీ పని చేసుకునే షేక్ అక్బర్(48)కు ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. తన కుమార్తె సైరా బేగం(14)కు పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి.. తాను ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఐదేళ్ల నుంచి అక్బర్ భార్య వేరుగా ఉంటున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


Next Story