వరదనీటిలో‌ చిక్కుకున్న రైతులు

by  |

దిశ ప్రతినిధి, వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లి వద్ద చలి వాగు‌ వద్ద వరద నీటిలో‌‌‌ పలువురు రైతులు చిక్కుకున్నారు. ఉదయం 12 మంది రైతులు వ్యవసాయ పనుల కోసం వెళ్లగా వాగు ఉప్పొంగడంతో చిక్కుకుపోయారు. దీంతో బాధిత రైతులు కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. సంఘటనా‌ స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బంది రైతులను కాపాడేందుకు ‌చర్యలు చేపట్టారు.



Next Story