హరితహారం వద్దంటూ రైతుల నిరసన

by  |
హరితహారం వద్దంటూ రైతుల నిరసన
X

దిశ, జగిత్యాల:

పండించిన ధాన్యం ఆరబెట్టేందుకు కెటాయించిన స్థలంలో హరిత హారం కార్యక్రమం చేపట్టడంపై రైతులు మండిపడితున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వారు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబోసేందుకు కెటాయించిన స్థలంలో హారితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటితే ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటిక్యాల రహదారిపైనా, మొక్కలు నాటేందుకు తవ్విన గంతల వద్ద రైతులు బైఠాయించి ఆందోళన చేశారు. ఉన్న కొద్దిపాటి స్థలంలో మొక్కలు నాటితే తాము విక్రయించేందుకు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎక్కడ ఆరబోయాలని రైతులు ప్రశ్నించారు.



Next Story